పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును మంగళవారం అందించారు. అలాగే కోచ్ నాగపురి రమేష్కి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.
కోటి రూపాయల నగదుతో పాటు ప్రకటించినట్టుగా గ్రూప్ -2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థల కేటాయింపుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తమకు అందిస్తున్న ప్రోత్సాహంపై దీప్తి జీవాంజి, కోచ్ రమేష్ లు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment