రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - కలెక్టర్ జితేష్ వి పాటిల్

 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - కలెక్టర్ జితేష్ వి పాటిల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్  తోకలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

 జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా, రహదారి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల వివరాలు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.  రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించడానికి జాతీయ రహదారి పక్కల ఉన్న గ్రామాలలో పొలీసు కళా బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పొలీసు అధికారులకు సూచించారు. ఫస్ట్ రెస్పాండర్ గా ఉండేందుకు జాతీయ రహదారుల పక్కన ఉండే పెట్రోల్ బంకులు, దాబాలలో పనిచేసే వారికి, యువతకు, ప్రథమ చికిత్స, సీపీఆర్ పై అవగాహన కలిగించాలన్నారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, డిసి హెచ్ ఓ రవిబాబు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్లు, కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.