అన్నదానంతో వినాయకుని సాక్షాత్కారం లభిస్తుంది కొత్వాల

అన్నదానంతో వినాయకుని సాక్షాత్కారం లభిస్తుంది కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: అన్నదానం చేస్తే వినాయకుని సాక్షాత్కారం లభిస్తుందని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.  గణపతి నవరాత్రి మహోత్సవాల  అనంతరం పాల్వంచ మార్కెట్ లోని భజన మందిరం రామాలయం వద్ద మదర్ థెరెసా యూత్ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం నిర్వహించారు.

కార్యక్రమానికి హాజరైన కొత్వాల మాట్లాడుతూ వినాయకునికి నవరాత్రి పూజలతో అందరికి మేలు జరుగుతుందని అన్నారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం ఎంతో గొప్పది అని కొత్వాల అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, ఉత్సవ నిర్వాహకులు చిప్ప పెద్ద సత్యం, సాంగ అశోక్, హర్షవర్ధన్, మధు, చిప్ప చిన్న సత్యం, రామకృష్ణ, శ్రీకాంత్, ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.




Blogger ఆధారితం.