పొంగులేటి ఇంట్లో ఈడి దాడులు బిజెపి రాజకీయ కుట్ర - నూకల రంగారావు

పొంగులేటి ఇంట్లో ఈడి దాడులు బిజెపి రాజకీయ కుట్ర - నూకల రంగారావు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడి దాడులు కేవలం బిజెపి ఆడుతున్న రాజకీయ కుట్ర అని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు విమర్శించారు.  శనివారం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో నూకల రంగారావు కాంగ్రెస్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ఈడీ దాడులు బిజెపి రాజకీయ కుట్ర అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బిజెపి భయపెట్టాలని చూస్తుందని, బిజెపి వ్యతిరేక పక్షాలపై నిరంతరం ఈడి దాడులు చేయడమే లక్ష్యం గా పెట్టుకుందన్నారు. కర్ణాటకలో కూడా బిజెపి ఇదే తరహాలో ముందుకు సాగిందని, డీకే శివప్రసాద్ పై కూడా ఇలానే దాడులు ప్రయోగం చేశారు అని తెలిపారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను కూడా వదలకుండా కేంద్రంలోని బిజెపి ఈడి దాడులు చేయించింది అని తెలిపారు.

ఈడీ దాడులతో కాంగ్రెస్ కు ఏ విధమైన నష్టం జరగదని, రానున్న హర్యానా,జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.  రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నట్లు నూకల రంగారావు స్పష్టం చేశారు. 

ఈ సమావేశంలో ఎల్.డి.ఎమ్ కోర్డినేటర్ బద్ది కిషోర్, ఎస్సీ సెల్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు పెంకి శ్రీనివాస రావు, పాల్వంచ రూరల్ ఓబిసి అధ్యక్షులు కట్టా సోమయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాము నాయక్, మైనారిటీ కాంగ్రెస్ జిల్లా నాయకులు షేక్ దస్తగిరి, నాయకులు సాంబయ్య, చాంద్, హుస్సేన్ నాయక్, జల్లారపు నాగేశ్వర రావు, వేమా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.