అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న - బిఆర్ఎస్ రాష్ట్ర నేత వనమా రాఘవ
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, వనమా బేబీ సరోజినీ దంపతులు, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల ప్రవీణ్ కుమార్, శ్రీలత దంపతులు పాల్గొని శ్రీ సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మహా పుణ్యకార్యం, గురువుల ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.


Post a Comment