పెద్దమ్మ తల్లికి ఘనంగా పంచామృతాభిషేకం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాథపురంలో వెలిసియున్న శ్రీ కనక కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ గుడి)లో శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో దేవస్థాన అర్చకులు, భక్తులు అమ్మవారి జన్మస్థలం వద్ద అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించి, అనంతరం దేవాలయంలోని అమ్మవారి మూలవిరాట్కు పంచామృతాలతో అభిషేకం చేశారు.
అనంతరం పంచాహారతులు, నివేదిక, నీరాజన, మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Post a Comment