భారీగా మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

 

భారీగా మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం బయట మొక్కల ప్లాంటేషన్ చేయడానికి స్థలాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాత శిశు ఆరోగ్య కేంద్రం బయట ఉన్న 1.5 ఎకరాల ఖాళీ భూముల్లో భారీగా మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆదేశాల మేరకు, ఖాళీ ప్రదేశాన్ని మూడు భాగాలుగా విభజించి ఔషధ మొక్కలు, సుందరీకరణ మొక్కలు మరియు భారీ వృక్షాలను నాటాలని సూచించారు.


ఈ వృక్షాలు, మాత శిశు కేంద్రానికి వచ్చే రోగులు మరియు ప్రజలకు నీడనిచ్చేలా ఉండేలా, అలాగే ఆరోగ్య కేంద్రం అందంగా ఉండేలా ఉండాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా, వర్షపు నీరు నిలవకుండా, నీరు భూమిలోకి ఇంకే విధంగా చిన్న గుంతలను ఏర్పాటు చేయాలని, రానున్న వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషంజన్ స్వామి, మున్సిపల్ డి.ఈ. రవి కుమార్ మరియు 8వ, 9వ వార్డు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.