పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ యోగాను అలవరుచుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ యోగాను అలవరుచుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్



జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం 
పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ దైందిన జీవితంలో యోగాను అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. శుక్రవారం హేమచంద్రాపురం లోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బందికి యోగా తరగతులను ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం విధులలో నిమగ్నమై  ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు,మానసికంగా కూడా దృఢంగా ఉండేందుకు ఇకపై ప్రతి శుక్రవారం యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. కావున పోలీసు అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ తరగతుల ఆవశ్యకత తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ తరగతులలో కొత్తగూడెం సబ్ డివిజన్ లోని పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది,ఆర్మడ్ రిజర్వు అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్,రమేష్,శివప్రసాద్,ఆర్ఐలు లాల్ బాబు,సుధాకర్,నరసింహారావు,కృష్ణారావు, సిబ్బంది హాజరయ్యారు.


Blogger ఆధారితం.