నవభారత్ బృందావనం కాలనీవాసుల సమస్యలు పరిష్కరించండి - కొత్వాల

నవభారత్ బృందావనం కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించండి - కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర బృందావనం కాలనీవాసులు పలు సమస్యలు ఎదుర్కుంటున్నారని, వాటిని పరిష్కరించేలా మున్సిపల్ అధికారులకు తగు ఆదేశాలుఇవ్వాలని డిసిఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కొత్వాల తోపాటు కాలనీ వాసులు కలిసి సమస్యలను విన్నవించారు. ఇటీవల బృందావనం కాలనీ లో ఉండే మురికి కాల్వ ను కొంతమంది పూడ్చి వేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణ రావు తో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన బృందావనం కాలనీ లో ఎక్కువగా కేటీపీఎస్ ఉద్యోగులు నివసిస్తున్నారని వారికి రోడ్డు, డ్రైన్, త్రాగునీటి సరఫరా చేపించాలని కలెక్టర్ ను కోరారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై.వెంకటేశ్వర్లు, దారా చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.