పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలం కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ తల్లి గుడి) లో శుక్రవారం అమ్మవారికి పంచామృతలతో దేవస్థాన అర్చకులు, భక్తులు అమ్మవారి జన్మస్థలం వద్ద అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు.
అనంతరం దేవాలయంలోని అమ్మవారి మూల విరాట్ కు పంచామృతాలతో అభిషేకం, పంచ హారతులు తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు

Post a Comment