పేదరిక నిర్మూలన ద్వారా మెరుగైన జీవితం - న్యాయాధికారి ఎం.రాజేందర్
శుక్రవారం పాల్వంచ మండలంలోని కుంటి నాగులగూడెంలో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగం, చదువుకోవాల్సిన వయసులో పనికి వెళ్లడం వంటి అంశాలు పేదరికానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పేదరికం తగ్గించవచ్చని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామాలలో బాల్యవివాహాలను నిషేధించాలని కోరారు. పేదరికాన్ని తగ్గించేందుకు మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో చేరి స్వయం సహాయక ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది తోట మల్లేశ్వరరావు, ఎస్ఐ జీవన్ రాజ్, పారా లీగల్ వాలంటీర్స్ బాడీషా బిక్షమయ్య, ఎం. జానకిరామ్, కె. వీరభద్రం, ఆర్. పి. నాగమణి, గ్రామ పెద్దలు దశరాజు, రమేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Advertising:


Post a Comment