జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : హేమచంద్రపురం లోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హాజరయ్యారు. జిల్లా ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ అధికారులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగను ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు జరుపుకుంటారని, ఇది మతపరమైనా సాంస్కృతిక పండుగగా ప్రాముఖ్యత పొందిందని అన్నారు. ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అన్ని మతాల ప్రజలు మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.


తర్వాత సెమీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి పంచుకున్నారు.


ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు నరసింహారావు, కృష్ణారావు, లాల్ బాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.