పోలీసులు దృఢంగా ఉండాలి - ఎస్పీ రోహిత్ రాజ్

పోలీసులు దృఢంగా ఉండాలి - ఎస్పీ రోహిత్ రాజ్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది, అధికారులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సూచించారు.కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్ లోని పోలీసు అధికారులు,  సిబ్బందికి వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియజేసే అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెంలోని పీఆర్ ఫంక్షన్ హాల్  లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిపుణులైన  జవ్వాది వెంకటేశ్వరరావు అధికారులు, సిబ్బందికి ఒత్తిడిని తగ్గించుకోవడంపై అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ మాట్లాడుతూ  పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది, అధికారులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు.

ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకునే విధంగా మార్గాలను ఎంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. విధుల నిర్వహణలో భాగంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడిని పెంచుకుని అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దని తెలిపారు.పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉండదని తెలియజేసారు.శారీరకంగా కూడా దృఢంగా ఉండేటందుకు ప్రతిరోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. అనంతరం కొత్తగూడెం కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ మాట్లాడుతూ ఇటీవల జిల్లా పోలీస్ శాఖలో జరుగుతున్న కొన్ని సంఘటనల దృష్ట్యా పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది, అధికారులలో మానసికంగా దృఢంగా ఉండేందుకు జిల్లా ఎస్పీ  ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు  తెలిపారు.

ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,కొత్తగూడెం 3టౌన్ సీఐ శివ ప్రసాద్, ఇతర పోలీసులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Blogger ఆధారితం.