పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు వారధిగా పనిచేయాలి - న్యాయమూర్తి పాటిల్ వసంత్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు, న్యాయ సేవాధికార సంస్థలకు మధ్య వారధిగా నడుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. శనివారం పారా లీగల్ వాలంటీర్ల కోసం నిర్వహించిన ఒక రోజు శిక్షణా శిబిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలు, చట్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థల విధులు, లక్ష్యాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, ఏ పౌరుడు న్యాయాన్ని కోల్పోకుండా పారా లీగల్ వాలంటీర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
అనంతరం శిక్షణా ట్రైనర్లుగా నియమించిన న్యాయవాదులు పారా లీగల్ వాలంటీర్లకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రామారావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యావాదులు మారపాక రమేష్ కుమార్, పాండురంగ విటల్,సాదిక్ పాషా, నరేంద్రబాబు, జీకే అన్నపూర్ణ, మహాలక్ష్మి, ఎన్. ప్రతిభా, నాగస్రవంతి, మెండు రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment